గోపన్ పల్లి లో బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశం

  • హాజరైన కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్, బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ లు
సమావేశం లో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్, చిత్రంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్, ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ లు ఉన్నారు. 

గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని శుక్రవారం గోపన్ పల్లి లో నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్,ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్, నాయకులు రవికుమార్ యాదవ్ లతో పాటు డివిజన్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులు దిశా నిర్దేశం చేశారు. పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో పార్టీ అభ్యర్థులు ఎల్లేష్, గంగాధర్ రెడ్డి, రఘునాథ్ యాదవ్, నాయకులు మల్లేష్ యాదవ్, పెరిక సురేష్, కుమార్ యాదవ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్
పార్టీ అభ్యర్థులు గంగాధర్ రెడ్డి, రఘునాథ్ యాదవ్, ఎల్లేష్ లతో నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ ధర్మపురి అరవింద్

 

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here