ముంపుకు గురైన బాధితులందరికీ నష్టపరిహారం చెల్లించాలి: మొవ్వ సత్యనారాయణ

డీఈ చెన్నారెడ్డికి వినతిపత్రం సమర్పిస్తున్న మొవ్వ సత్యనారాయణతో బిజెపి నాయకులు

హఫీజ్ పెట్(నమస్తే శేరిలింగంపల్లి): భారీ వర్షాల కారణంగా వరద ముంపుకు గురైన ప్రతీ బాధిత కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని శేరిలింగంపల్లి బిజెపి నాయకులు మొవ్వ సత్యనారాయణ డిమాండ్ చేశారు. హఫీజ్ పెట్ డివిజన్ కు చెందిన బిజెపి నాయకులు డివిజన్ లోని ముంపుకు గురైన బస్తీలలో పర్యటించి రూపొందించిన నివేదికను నాయకులు సోమవారం మొవ్వ సత్యనారాయణ తో కలిసి జీహెచ్ఎంసీ డీఈ చెన్నారెడ్డికి సమర్పించారు. ఈ సందర్భంగా మొవ్వ మాట్లాడుతూ ప్రభుత్వం అందించిన వరద సహాయం నిజమైన బాధితులకు బదులుగా టీఆరెస్ పార్టీ కార్యకర్తలకు చేరిందని ఆరోపించారు. బాధితులందరికీ న్యాయం చేసేవరకు తాము విశ్రమించబోమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ బోయిని మహేష్ యాదవ్, శేర్లింగంపల్లి ఐటీ సెల్ కన్వీనర్ కళ్యాణ్, జనరల్ సెక్రటరీ పవన్, నాయకులు సురేష్, లక్ష్మణ్ , నందు, సాయి, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here