- సీఎం రేవంత్ రెడ్డి కి క్షమాపణ చెప్పకుంటే తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరిక
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని హైదరనగర్ లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన దిష్టిబొమ్మ, ధర్నా కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొని మాట్లాడారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-06-at-5.21.08-PM-1.jpeg)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ కోరాలని, లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎక్కడికక్కడ ఖండిస్తున్న క్రమంలో జవాబుదారీగా బాల్క సుమన్ బాధ్యతలు వహించాలని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బాల్క సుమన్ ను తిరగడానికి వీలు ఇవ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-06-at-5.21.08-PM.jpeg)
ఈ కార్యక్రమంలో కూన సత్యం గౌడ్, గొట్టిముక్కుల వెంకటేశ్వరరావు, నల్ల సంజీవరెడ్డి, బాలింగ్ యాదగిరి గౌడ్, కృష్ణ ముదిరాజ్, నాగేశ్వరరావు, వీరెందర్ గౌడ్, మన్నేపల్లి సాంబశివరావు, కావూరి ప్రసాద్, నడిమిటీ కృష్ణ, మహమ్మద్ ప్యాయజ్, భాషిపాక యాదగిరి, ఉప్పల ఏకాంత్ గౌడ్, కొఠారి వెంకట్, బస్వంత్ రాజ్, గోపాల్, ప్రభాకర్, మద్దెల రాము, జావిద, ఎజాజ్, అసిఫ్, ఖజి, రాజేష్, హాబీబ్, ఇర్ఫాన్, ఫాసి, అంజనేయులు, అశోక్, మహేష్ గౌడ్, షాము, రషీద్, మహేష్, మారుతి, విరేశ్, మహమ్మద్, యూసుఫ్, యూనిస్, స్వామి, రాజు, ఇమ్రాన్, జమాల్ పాల్గొన్నారు.