సిజెఐ ఎన్‌.వి.ర‌మ‌ణ‌ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసిన ప్ర‌భుత్వ విప్ గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: భార‌త సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ఇటీవ‌ల ప‌దవీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన జ‌స్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ‌ను శేరిలింగంప‌ల్లి శాస‌న‌స‌భ్యులు, ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. బుధ‌వారం రాజ్‌భ‌వ‌న్‌లో జ‌స్టిస్ ర‌మ‌ణ‌ను క‌లిసిన గాంధీ పుష్ప‌గుచ్ఛంతో సత్క‌రించి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా గాంధీ మాట్లాడుతూ తెలుగువాడైన ఎన్‌.వి.ర‌మ‌ణ అత్యున్న‌త న్యాయ‌స్థాన ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం తెలుగువారంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు. ఆయ‌న ప‌ర్య‌వేక్ష‌ణ‌లో న్యాయ‌వ్య‌వ‌స్థ నూత‌న సంస్క‌ర‌ణ‌ల‌తో ప్ర‌తిఒక్క‌రికీ స‌త్వ‌ర న్యాయం జ‌రిగేలా అభివృద్ది జ‌ర‌గాల‌ని అభిల‌షిస్తున్న‌ట్లు తెలిపారు.

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్‌.వి.ర‌మ‌ణ‌తో ప్ర‌భుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here