సమాజ సేవలో అక్షర కౌముది సేవలు అమోఘం : అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహ రెడ్డి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: సాహిత్య‌, సామాజిక‌, సాంస్కృతిక రంగాల్లో విశేష సేవ‌లు అందిస్తున్న అక్ష‌ర కౌముది సంస్థ కృషి అమోఘ‌మ‌ని మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఏనుగు న‌ర‌సింహ‌రెడ్డి అన్నారు. బుధవారం అక్షర కౌముది సంస్థ ద్వితీయ వార్షికోత్సవ ముగింపు సభను అంతర్జాల వేదిక ద్వారా నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన ఏనుగు న‌ర‌సింహ‌రెడ్డి మాట్లాడుతూ సాహిత్యాన్ని పెంపొందించడ మే కాకుండా సామాజిక సాంస్కృతిక రంగాల్లో సేవలు అందిస్తున్న అక్షర కౌముది సంస్థ సేవ‌లు అభినంద‌నీయ‌మ‌ని తెలిపారు. ముఖ్యంగా విధ్యార్ధులను తీర్చిదిద్దాలనే సత్ సంకల్పం తో ముందుకు వెళుతున్న సంస్థకు చేయుతనందిస్తామని అన్నారు. ప్రాచీన కవులు రచయితల సాహిత్యం ను చదివితే నవతరం కవులు రాణిస్తారని అన్నారు.

ద్వితీయ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా అంత‌ర్జాల వేదిక‌గా స‌మావేశ‌మైన అక్ష‌ర కౌముది సంస్థ స‌భ్యులు

సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు నందిని సిధారెడ్డి మాట్లాడుతూ నేడు పుంఖాను పుంఖాలుగా వస్తున్న కవిత్వంలో వస్తు ప్రాధాన్యత కొరవడుతోందని అన్నారు. నిక్కచ్చిగా కవిత్వం రాయలంటె అభ్యసనం, శ్రవణం, శిక్షణ ఎంతో అవసరం అని అన్నారు.
అక్షర కౌముది సంస్థ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా జాతీయ స్థాయిలో అంతర్జాల కవి సమ్మేళనం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉన్నదని వారు పేర్కొన్నారు.
కవి సినిగేయ రచయిత సాధనాల వెంకట స్వామి నాయుడు మాట్లాడుతూ ఒక స్నేహ పుష్పం వికసించి అక్షర కౌముది సంస్థ గా ఆవిర్భవించి సాహిత్య సామాజిక సేవా పరిమళాలను అందించడం అభినందనీయం అని అన్నారు. ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల్లో ఒక రంగంలో రాణించాలి అంటే ఎంతో శ్రమతో కూడుకున్నది. నేడు ఈ సంస్థ మూడు రంగాల్లో విభిన్న కార్యక్రమాలు చేపట్టడం ఎంతో హర్షణీయం అన్నారు.
తెలంగాణ రాష్ట్ర రచయితల సంఘం అధ్యక్షులు నాలేశ్వ రం శంకరం మాట్లాడుతూ కవిత్వం ఎంత రాసినా తీరని దాహం లాంటిదని అన్నారు. రోజు రోజుకు సాహిత్య రచనలో విభిన్న ప్రక్రియలను నూతనత్వం తో కవులు రాయడం వారికి అక్షర కౌముది సంస్థ చేయూత నివ్వడం ఎంతో సంతోషదాయకం అన్నారు. అక్షర కౌముది సంస్థ వివిధ స్థాయిలో పాఠశాల విద్యార్థులకు వక్తృత్వ ,పాటల పోటీలు నిర్వహించి ,విద్యార్థుల సృజనాత్మక శక్తిని వెలికి తీయడం ,వారికి ప్రశంస పత్రాలు అందించడం అభినందనీయం అన్నారు.
ప్రముఖ కవయిత్రి ,రచయిత్రి , రేడియో వ్యాఖ్యాత ఐనం పూడి శ్రీలక్ష్మి మాట్లాడుతూ నేటి బాల బాలికలే రేపటి భావి తరానికి వారదులని అన్నారు. బాలసాహిత్యంను పాఠశాల స్థాయిలో బోధిస్తే విద్యార్థుల్లో ఆత్మ స్థార్యం, సృజనాత్మక శక్తిని పెంపొందించవచ్చని అన్నారు.
అక్షర కౌముది సంస్థ అధ్యక్షులు తులసి వెంకట రమణా చార్యులు మాట్లాడుతూ సాహిత్యంలో రాణించాలంటే అలంకారాలు ఉండాలని తెలిపారు. ప్రాచీన కవులు రచయితలు అందరూ వారి వారి రచనల్లో చక్కని చిక్కనైనా కథ , నేపథ్యం తో శైలి , వర్ణన ఉంటుందన్నారు. నేడు ఆధునిక కాలంలో వస్తున్న కవిత్వంలో ఇంకా ఎన్నో మార్పులు రావాలని వారు అన్నారు.
చిత్రకారుడు కుంచే ద్వారా చిత్రాన్ని నిర్మిస్తే. కవులు తమ భావాలని అక్షర రూపం లో చక్కని అక్షర శిల్పాన్ని నిర్మిస్తారని అన్నారు.
ఈ సంద‌ర్భంగా సాహిత్య‌, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి సంస్థ అధ్యక్షులు తులసి వెంకట రమణా చార్యులు , ప్రధాన కార్యదర్శి మూర్తి శ్రీదేవి వారి తల్లి తండ్రుల పేరు మీద స్మారక పురస్కారాలను ప్రకటించారు.సామాజిక రంగంలో కృషి చేసిన ప్రముఖ వైద్యనిపుణులు డాక్టర్ నాగేశ్వర రావు కు తులసి శేషా చార్యులు ఆండాలు స్మారక పురస్కారం ప్రకటించారు. సాహిత్య రంగంలో కృషి చేసిన డాక్టర్ ఐనం పూడి శ్రీలక్ష్మి గురునాధం ,సౌభాగ్య పేరునా స్మారక పురస్కారం, సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రంగస్థల కళా కారుడు ఆమని కృష్ణ కు పురస్కారం ప్రకటించారు. త్వరలో సంస్థ ద్వారా జరిగే సభలో సన్మానం, జ్ఞాపిక ప్రశంసాపత్రం అందజేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత విద్వాంసురాలు, దేవి మ్యూజిక్ అకాడమీ అధ్య‌క్షురాలు దేవి, కవయిత్రి రచయిత్రి వురిమళ్ళ సునంద , కవులు పక్కి రవి శేఖర సత్యనారాయణ మూర్తి , కొంపెల్లి రామయ్య, దాసరి మోహన్, కట్టేకొల చిన నరసయ్య, కొత్తపల్లి కృష్ణ రావు, మోటూరి నారాయణ రావు, సంస్థ ప్రధాన కార్యదర్శి మూర్తి శ్రీదేవి కార్య వర్గ సభ్యులు మేనావత్ రాందాస్, తాళ్లూరి వెంకట కృష్ణ, ముదిగొండ సంతోష్ కుమార్ శర్మ, గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాద్, గడ్డం వెంకట రమణ , మాధవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here