గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): భారీ వర్షాల నేపథ్యంలో డివిజన్ పరిధిలోని పలు రహదారులను హెచ్ఆర్డిసిఎల్ ఈఈ సర్దార్ సింగ్, బల్దియ ఈఈ వెంకటేశ్వర్లుతో కలసి స్థానిక కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబ శనివారం పరిశీలించారు. ఖాజాగూడ రహదారి వద్ద పైప్ లైన్ వేసి మ్యాన్ హోల్ కట్టకుండానే మట్టిని కప్పేయడంతో వర్షానికి అక్కడ గుంత ఏర్పడిందని అధికారులకు వివరించిన కార్పొరేటర్ వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా పంచవటి కాలనీ రామాలయం దగ్గర తెగిన పందన్ వాగు కట్ట పనులను అధికారులతో కలసి సాయిబాబా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఈ శ్రీనివాస్, ఏఈ కృష్ణవేణి, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.