శేరిలింగంపల్లి, ఆగస్టు 9 (నమస్తే శేరిలింగంపల్లి): శాంతినగర్ లో ఆషాడ మాస బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక యువత నిర్వహించిన తొట్టెల ఊరేగింపులో శేరిలింగంపల్లి సీపీఎం నాయకుడు కృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో స్థానిక భక్తులు, కాలనీ యూత్ పాల్గొన్నారు.






