శేరిలింగంపల్లి, మే 25 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రపంచ ప్రఖ్యాత జ్యూవెలరీ సంస్థ Malabar Gold & Diamonds తమ చందానగర్ షోరూంలో మైన్ డైమండ్స్ షో ను ఘనంగా ప్రారంభించింది. మే 24 నుంచి 31 వరకు నిర్వహించనున్న ఈ ప్రత్యేక వజ్రాభరణాల ప్రదర్శనకు వినియోగదారులు, సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ డైమండ్ షోను ముఖ్య అతిథులచే ప్రారంభించగా, వివిధ రకాల ప్రత్యేక వజ్రాభరణాలను వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచారు. రోజువారీ వినియోగానికి అనువైన నగలు, వివాహ వేడుకల కోసం ప్రత్యేక డిజైన్లు, లైట్ వెయిట్ ఆభరణాలు, పురుషుల కోసం ప్రత్యేక కలెక్షన్లు ఈ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

మలబార్ గోల్డ్ & డైమండ్స్ వినియోగదారుల నమ్మకాన్ని కాపాడేందుకు 12 ప్రత్యేక హామీలను అందిస్తోంది. కచ్చితమైన తయారీ ధరలు, పారదర్శక ధరల విధానం, జీవితకాల ఉచిత నిర్వహణ, పాత బంగారు ఆభరణాలపై 100 శాతం విలువ, BIS హాల్మార్క్ HUID బంగారం, IGI, GIA ధ్రువీకరించిన వజ్రాభరణాలు, బైబ్యాక్ గ్యారెంటీ వంటి సేవలను సంస్థ అందిస్తోంది.
1993లో కేరళలో స్థాపించబడిన Malabar Group కు చెందిన ఫ్లాగ్షిప్ సంస్థగా మలబార్ గోల్డ్ & డైమండ్స్ కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్తో పాటు ఆస్ట్రేలియా, కెనడా, యూకే, యూఎస్ఏ, మిడిల్ ఈస్ట్, ఫార్ ఈస్ట్ దేశాల్లో 445కి పైగా షోరూములతో సంస్థ తన వ్యాపార విస్తరణను కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద జ్యూవెలరీ రిటైలర్లలో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ సంస్థ, డెలాయిట్ గ్లోబల్ పవర్స్ ఆఫ్ లగ్జరీ గూడ్స్ 2023 ర్యాంకింగ్లో 19వ స్థానాన్ని దక్కించుకుంది.





