శేరిలింగంపల్లి, మార్చి 2 (నమస్తే శేరిలింగంపల్లి): ఉమ్మడి కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఎమ్మెల్యే, పార్టీ శేరిలింగంపల్లి ఇంచార్జ్ మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా ఉమ్మడి కొండాపూర్ డివిజన్, కొండాపూర్, అంజయ్య నగర్, హైటెక్ సిటీ మూడు డివిజన్లలో ప్రజల సమస్యలపై పోరాడుదామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






