శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 27 (నమస్తే శేరిలింగంపల్లి): బ్రహ్మం గారి మఠం 12వ పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి బాధ్యతలు చేపట్టారు. దేవాదాయ శాఖ, మఠం వారసుల సమక్షంలో వేదమంత్రాల నడుమ ఆయనకు బంగారు కిరీటం, జపమాలతో సన్మానం చేసి పీఠాధిపతిగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ సిరిపురం హరికృష్ణ చారి కుటుంబ సమేతంగా పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. నిత్య పూజల్లో పాల్గొని ఆశీర్వచనాలు పొందారు.






