చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక సోమవారం సందర్భంగా శివుడికి నమక చమక సహిత మహాన్యాస పూర్యక ఏకాదశ మహా రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు శ్రీ భవాని శంకరస్వామిలను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.