శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సర్కిల్ పరిధిలో డిప్యూటీ కమీషనర్ D. శశి రేఖ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను స్థానిక గంగారం బేబీ పౌండ్ దగ్గర ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు స్థానిక శ్యాసన సభ్యుడు ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు సాంప్రదాయ బద్దంగా నిర్వహించుకోవడం అభినందనీయం అన్నారు.






