శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్ డివిజన్ జవహర్ కాలనీ, సత్య ఎనక్లేవ్ , అన్నపూర్ణ ఎన్ క్లేవ్, శంకర్ నగర్, వేమన కాలనీ తదితర కాలనీల్లో ఏర్పాటు చేసిన గణనాథులను కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మండపాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలు గణేష్ నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని, అన్ని చెరువులు, కుంటల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.






