దీనబంధు కాలనీలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఎన్నిక‌ల ప్ర‌చారం

కూక‌ట్‌ప‌ల్లి‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): డిసెంబర్ 1న జరగబోయే జిహెచ్ఎంసి ఎన్నికలలో తెరాస పార్టీ అధిష్టానం బలపర్చిన కూకట్‌ప‌ల్లి డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి జూపల్లి సత్యనారాయణ గెలుపుకు మద్దతుగా దీనబంధు కాలనీలో తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. అంతకు ముందు ఆయ‌న స్థానికంగా తెరాస పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

కాల‌నీలో తెరాస పార్టీ కార్యాల‌యాన్ని ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ జిహెచ్ఎంసి ఎన్నికలలో కూకట్‌ప‌ల్లి డివిజన్ తెరాస పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి జూపల్లి సత్యనారాయణని భారీ మెజారిటీతో గెలిపించాల‌ని కోరారు. అందుకు పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు సైనికుల‌లా పనిచేయాలని అన్నారు. తెరాస పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు. పార్టీలో అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామని, ప్రతి ఒక్కరం కష్టపడి బంగారు తెలంగాణలో భాగస్వాములం అవుదామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

మీడియాతో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here