శేరిలింగంపల్లి, ఆగస్టు 14 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని TGSPDCL సబ్ స్టేషన్ లో TGSPDCL అధికారులు CMD ముషారఫ్ అలి, CE కామేష్, SC రవికుమార్, DE జనప్రియ, AD హరికృష్ణలతో కలసి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఆకస్మికంగా పర్యటించి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో విద్యుత్ సరఫరా, కొత్త లైన్ ల ఏర్పాటు, కొత్తగా ఏర్పాటు చేయవలసిన ట్రాన్స్ఫార్మర్ల సంఖ్యను పెంచాలని సిఎండికి విన్నవించామని అన్నారు. ఈ కార్యక్రమంలో TGSPDCL సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






