బంజారా యువజన నాయకుల చొరవతో గోపన్ పల్లి ప్లే గ్రౌండ్ అభివృద్ధి పనులు

పార్కులో వ్యర్దాలను తొలగిస్తున్న దృశ్యం

గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి తండా బంజారా యువజన సంఘం అధ్యక్షుడు సురేష్ నాయక్ బృందం స్థానికంగా గల ప్లే గ్రౌండ్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గురువారం పార్క్ స్థలాన్ని చదును చేయడంతో పాటుగా చెత్త చెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా సురేష్ నాయక్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి పరిధిలో 4 ఎకరాల విస్తీర్ణం ఉన్న పార్కులు చాలా తక్కువ అని, వీటిని అభివృద్ధి చేస్తే స్థానికులు ఉపయోగించుకునే వీలుంటుందని తెలిపారు. పార్కులో వాకింగ్ ట్రాక్, చిన్న పిల్లల ఆట స్థలం, క్రికెట్ గ్రౌండ్ ను అభివృద్ధి చేయాల్సి ఉందని తెలిపారు. హుడా కాలనీకి చెందిన సత్యనారాయణ రావు సహకారంతో పార్కు ను శుభ్ర పరచామని, ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిదుకు పార్కు అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బంజారా యువజన సంఘం నాయకులు బబ్లూ,రాకేష్, రాజా, ప్రవీణ్, మోహన్, శంకర్, దుర్గేష్, శ్రీరామ్, జగన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here