శేరిలింగంప‌ల్లి ప్ర‌జ‌ల‌కు PAC చైర్మన్ గాంధీ ద‌స‌రా శుభాకాంక్ష‌లు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు, కార్పొరేటర్లకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయభిలాషులకు, ఆత్మీయులకు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ దసరా పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి దసరా పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాన‌ని, చెడుపై గెలిచే విజయానికి ప్రతీకగా దసరా పర్వదినం జరుపుకుంటారని అన్నారు. ప్రజలందరు సుఖ సంతోషాలతో ఆనందంగా దసరా పండుగను ఘనంగా జరుపుకోవాలని, పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని అన్నారు. చాలా పవిత్రమైన పండుగ అని, అందరికీ విజయం కలగాలని కోరుకుంటున్నానని అన్నారు. పండుగను చక్కటి వాతావరణంలో కుటంబ సభ్యుల మధ్య ఆనంద దాయకంగా, సంతోషకరంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here