గాంధీజికి ర‌వికుమార్ యాద‌వ్ నివాళి

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ మక్త మహబూబ్ పేట్ బీజేవైఎం నాయకుడు గణేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి రవికుమార్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా ర‌వికుమార్ యాద‌వ్ మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్రం సాధించిన నాయకులలో అగ్రగన్యుడు మహాత్మా గాంధీజీ అన్నారు.

గాంధీ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించిన ర‌వికుమార్ యాద‌వ్

బాపూజీ సూక్తులు నేటి పాలనకు మార్గాలని, అవే నిజమైన పాలనకు మార్గదర్శకాల‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గ కన్వీనర్ రాఘవేంద్రరావు, సీనియర్ నాయకులు నాగులు గౌడ్, రాజేష్ గౌడ్, శ్రీనివాస్, లక్ష్మణ్ ముదిరాజ్, శివరాజ్ ముదిరాజ్, రామకృష్ణారెడ్డి, సురేష్ ముదిరాజ్, కిరణ్ రెడ్డి శివారెడ్డి, బాబు ముదిరాజ్, రాము, శంకరయ్య మల్లేష్, మన్యం, చందు, ప్రేమ్, ప్రవీణ్, గౌతమ్, నరేష్, గోపి, ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here