ఒంగోలు చేరిన రామన్న-వెంకన్న మహా పాదయాత్ర

  • త్రివేణి అధినేత వీరేంద్ర చౌదరిని సత్కరించిన వినయకుమార్ పుట్ట

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): త్రివేణి విద్యా సంస్థల చైర్మన్, గొల్లపూడి వీరేంద్ర చౌదరి 2004 ఏడాది నుండి ప్రతీ లీపు సంవత్సరం భద్రాచల రామయ్య సన్నిధి నుంచి తిరుమల శ్రీవారి సన్నిధికి పాదయాత్ర సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే 18/09/24 పౌర్ణమి నాడు 7వ సారి మహా పాదయాత్ర ప్రారంభించి ఒంగోలు సమీపంలోని వారి స్వగ్రామమైన దొడ్డవరానికి చేరుకున్నారు. ఈ క్రమంలో శేరిలింగంపల్లికి చెందిన ప్రముఖ యోగ శిక్షకులు పుట్ట వినయకుమార్ గౌడ్ త్రివేణి సిబ్బందితో కలసి వారి అధినేత గొల్లపూడి వీరేంద్ర చౌదరిని సత్కరించి, అభినందనలు తెలిపారు.

పాద‌యాత్ర కొన‌సాగిస్తున్న దృశ్యం

వారి యోగక్షేమాలు తెలుసుకుని, తిరుమల వరకు వారి పాదయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆకాంక్షించారు. అనంతరం వీరేంద్ర చౌదరి యాత్రా బృందంతో కలసి 7 వేల అడుగులు పాదయాత్ర చేశారు. శ్రీవారి కటాక్షంతోనే మాహా పాదయాత్రలో భాగస్వామ్యం అయ్యామని, ఈ అవకాశం కల్పించిన త్రివేణి బృందానికి కృతజ్ఞుతలు తెలిపారు.

త్రివేణి అధినేత వీరేంద్ర చౌదరిని సత్కరిస్తున్న‌ వినయకుమార్ పుట్ట

ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు గడీల శ్రీధర్ గౌడ్, త్రివేణీ సీఆర్ఓలు సాయి నర్సింహా రావు, వెంకట్రావు, ఏసీఆర్ఓలు నరేష్, సతీష్, ఇంచార్జీలు రామకృష్ణ, కోటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here