ఆక‌ట్టుకున్న అన్న‌మ‌య్య కీర్త‌నల ఆలాప‌న‌లు

మాదాపూర్‌, సెప్టెంబ‌ర్ 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అన్నమాచార్యుల సంకీర్తనలను, తత్త్వాన్ని ప్రచారం చేసే కార్య‌క్ర‌మంలో భాగంగా పద్మశ్రీ డా.శోభారాజు ఆధ్వర్యంలో అన్నమయ్యపురంలో ప్రతి శనివారం జరిగే కార్య్రమం అన్నమ స్వరార్చనలో కళాకారులు సంగీత, నృత్య ప్రదర్శలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం ప్రచోతన్ మ్యూజిక్ అకాడ‌మి విద్యార్థులు మిష్క భరద్వాజ్, పృత, హరిణి, ఆనందిని, శ్రీదేవి, లావణ్య, మానస్, సుపర్ణి, సూర్య, దివ్య, తన్మయి, విషిక , గురుభక్తి, మనోన్మణి, దీప్తి, అంజని నిత్య బృందం, ఎండగాని, అన్ని మంత్రములు, ఆరగించి, పలుమురు ఉట్ల పండుగను, సతులాల, సకల లోకేశ్వరులు , సిరుతనవ్వుల వాడు, కొలనిదోపరికి, సువ్వి సువ్వి, గోవింద నామాలు వంటి కీర్తనాలాపన చేసి ప్రేక్షకులను అలరించారు. వీరికి తబలాతో సాయి నారాయణ, కీబోర్డ్ తో గురుప్రసాద్ వాద్యసహకారం అందించారు. శోభారాజు నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్విహించారు. అనంత‌రం శోభారాజు కళాకారులను సత్కరించారు.

అన్న‌మ‌య్య కీర్త‌న‌ల‌ను ఆల‌పిస్తున్న క‌ళాకారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here