బీజేపీ కార్య‌క‌ర్త గంగల శ్రీనివాస్ కు నాయ‌కుల నివాళి

శేరిలింగంప‌ల్లి ‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రాష్ట్ర బీజేపీ కార్యాల‌యం ఎదుట ఆత్మ‌హత్య‌కు య‌త్నించి తీవ్ర గాయాల‌కు గురై హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన‌ ఆ పార్టీ కార్య‌క‌ర్త గంగల శ్రీనివాస్ కు శేరిలింగంప‌ల్లి బీజేపీ నాయ‌కులు శుక్ర‌వారం నివాళులు అర్పించారు. శేరిలింగంప‌ల్లి డివిజ‌న్ ప‌రిధిలోని ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ సార్ చౌర‌స్తా (లింగంపల్లి రైల్వే బ్రిడ్జి) వ‌ద్ద శ్రీ‌నివాస్ చిత్ర‌ప‌టానికి బీజేపీ నాయక‌లు పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నిరంకుశ, నియంతృత్వ పాలనకు మనస్తాపం చెందే శ్రీ‌నివాస్ మృతి చెందాడ‌ని, ఇందుకు రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాల‌న్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శులు ప్రశాంత్ చారి, చిట్టారెడ్డి ప్రసాద్, సీనియర్ నాయకులు మారం వెంకట్, శాంతి బూషన్ రెడ్డి, శివకుమార్, ఉపాధ్యక్షులు బాలరాజు, కుమార్ యాదవ్, అశోక్ నాయక్, బాస్యా నాయక్, కిషోర్ యాదవ్, కార్యకర్తలు పాల్గొన్నారు.

గంగల శ్రీనివాస్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పిస్తున్న బీజేపీ నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here