ఘనంగా తారానగర్ దుర్గభవాని ఉత్సవ సమితి అమ్మవారి ఊరేగింపు

– రూ.51 వేలకు హుండీని దక్కించుకున్న రెడ్డి ప్రవీణ్ రెడ్డి

చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): తారానగర్ లో శ్రీ దుర్గ భవాని ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. సోమవారం అమ్మవారి నిమజ్జన ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేలం పాటలో స్థానిక వ్యాపారి రెడ్డి ప్రవీణ్ రెడ్డి రూ.51 వేలకు అమ్మవారి హుండీని దక్కించుకున్నారు. ఉత్సవాల్లో పాల్గొన్న హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయకుమార్ ను నిర్వాహకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో దుర్గాభవాని ఉత్సవ సమితి ప్రతినిధులు భీమని శ్రీనివాస్, మహేష్ తివారి, రవిచందర్ గుప్త, బాలకృష్ణ, మనీష్, కిరణ్, విజయ్, అజయ్, పాండు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

రూ.51 వేలకు అమ్మవారి హుండీని దక్కించుకున్న రెడ్డి ప్రవీణ్ రెడ్డితో దుర్గాభవాని ఉత్సవ కమిటీ ప్రతినిధులు
అమ్మవారి ఊరేగింపులో పాల్గొన్న హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్ ను సన్మానిస్తున్న ఉత్సవ సమితి సభ్యులు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here