గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్రాంగూడ, గోపన్పల్లి గ్రామాల్లో కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా బుధవారం పర్యటించారు. భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదకు ఇళ్లు మునిగిపోయిన కుటుంబాలకు ఆయన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10వేల సహాయాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈ కృష్ణవేణి, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ గిరి, వీఆర్వో శ్రీనివాస్, ఎస్ఏఫ్ఏ ఇంఛార్జి విశాలాక్షి, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ బాల రాజు, వర్క్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్, ఏరియా కమిటీ మెంబర్ రాజు ముదిరాజ్ పాల్గొన్నారు.







