వేమనరెడ్డి కాలనీలో ఎంపీ, కార్పొరేటర్ ప‌ర్య‌ట‌న

చందానగర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ ప‌రిధిలోని వేమనరెడ్డి కాలనీలో ఎంపీ రంజిత్ రెడ్డి, కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి, డీసీ సుధాంష్‌, ఈఈ చిన్నారెడ్డిలు గురువారం పర్యటించారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ, కార్పొరేటర్ లు మాట్లాడుతూ భారీ వర్షాల‌కు కాలనీలో ఉన్న కొన్ని రోడ్లలో నీరు నిలిచింద‌ని అన్నారు. ఎస్‌టీపీ ప్రహరీ గోడ కొత్తగా నిర్మించడం వలన ఈ సమస్య తలెత్తింద‌ని, కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామ‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రఘుపతి రెడ్డి, శ్రీకాంత్, పోచయ్య, జహీర్, గౌస్, గాల్ రెడ్డి, లక్ష్మ రెడ్డి, బాపి రెడ్డి, రుక్మాత్ రెడ్డి, విజయ్ రెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు.

వేమ‌న రెడ్డి కాల‌నీలో ప‌ర్య‌టిస్తున్న ఎంపీ రంజిత్ రెడ్డి, కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
స్థానికుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుంటున్న ఎంపీ రంజిత్ రెడ్డి, కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here