మాదాపూర్ ఎస్ఐ రాజేంద్రకు రెండేండ్ల జైలు శిక్ష

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సైగా పనిచేస్తున్న ఎ.రాజేంద్రకు రెండు సంవత్సరాల కఠినకారాగార జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ ఏసీబీ కోర్ట్ తీర్పు వెలువరించింది. 2013 జూన్ నెలలో రాయదుర్గం పోలీసు స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సమయంలో స్వాధీనం చేసుకున్న ఇర్షాద్ ఖురేషీ వాహనాన్ని తిరిగి ఇచ్చేందుకు రూ.10 వేలు లంచం డిమాండ్ చేశారు.

దీంతో ఖురేషీ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. మాటు వేసి రాజేంద్రకు ఖురేషీ రూ.10 వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ కేసులో హైదరాబాద్ ఏసీబీ కోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. ఎస్ఐ రాజేంద్రను దోషిగా తేల్చి జైలుశిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించింది. తీసుకున్న లంచంతో పాటు జరిమానాను తిరిగి చెల్లించకుంటే మరో మూడు నెలలు జైలు శిక్షను పొడగించాలని కోర్టు ఆదేశించింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here