ఆకట్టుకుంటున్న చూడచక్కని డిజైన్లు – కొనసాగుతున్న ఆల్ ఇండియా సారీ మేళ – అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు

నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో నిర్వహిస్తున్న అల్ ఇండియా సారీ మేళ విశేషంగా ఆకట్టుకుంటున్నది. వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన చేనేత చీరలు మహిళలను ఎంతగానో  ఆకట్టుకుంటున్నవి.

స్టాల్ లో కొలువుదీరిన చీరలు

రకరకాల రంగులలో, చక్కని డిజైన్స్ తో సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా శనివారం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మొదటగా డాక్టర్ కోసూరి శేషులత శిష్య బృందం  లో శ్రీమతి కొమండూరి పద్మశ్రీ, రోజా సముద్ర, పద్మ హేమమాలిని , లలిత, రాజ్యలక్ష్మి, సుష్మలు భక్త  రామదాసు కీర్తనలు  ఆలపించి మైమరపించారు. కుమారి అనిత ముక్త శౌర్య శిష్య బృందం చే మొహినియాట్టం నృత్య ప్రదర్శనలో శ్లోకం, చొకెట్టు, కరుకారే, అష్టపది, పదం,తిల్లాన మొదలైన అంశాలను అనిత, రామిందర్, మీరా నైర్, అనిజ బాబు,శరణ్య, మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.

సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గీతాలాపన చేస్తున్న కళాకారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here