బిజెపి తీర్థం పుచ్చుకున్న మాదాపూర్ డివిజన్ సాయి నగర్ వాసులు

నమస్తే శేరిలింగంపల్లి: గతంలో భిక్షపతి యాదవ్ చేసిన అభివృద్ధి, రవికుమార్ యాదవ్ నాయకత్వానికి మెచ్చి, నేడు నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై మాదాపూర్ డివిజన్ సాయి నగర్ కాలనీకి చెందినవారు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ సమక్షంలో శనివారం లక్ష్మయ్య, మారయ్య, రాజు, శేఖర్, యాదయ్య, ఎం,రాజు, హనుమంతు, శ్రీను, రాంబాబు, మహేష్ తదితరులు భారతీయ జనతా పార్టీ లో చేరారు.

రవి కుమార్ యాదవ్ సమక్షంలో బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకున్న మాదాపూర్ డివిజన్ సాయి నగర్ వాసులు

మరో కొద్ది రోజుల్లో పెద్దఎత్తున మా కాలనీ నుండి బిజెపి పార్టీలో చేరికలు ఉంటాయని వారు తెలిపారు, ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని , కేసిఆర్ దుర్మార్గపు పాలనను అంతమొందించే సమయం ఆసన్నమైందని , ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా , మాయమాటలు చెప్తూ పబ్బం గడుపుతున్నారని, ప్రజలు మీ మాటలు నమ్మే పరిస్థితిలో లేరని , రాబోయే ఎన్నికల్లో మీకు రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెడతారని అన్నారు. మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చిన , ఏ సమస్య వచ్చిన మీకు నేను, భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here