ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఘన‌ నివాళి

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర సాధన‌ కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నతుడు, తెలంగాణ సిద్దాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రైల్వే బ్రిడ్జి పక్కన గల ప్రొఫెసర్ జయశంకర్ సార్ సెంటర్ లో జయశంకర్ సార్ విగ్రహానికి స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ భావజాలం కలిగినవారని, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టి స్వరాష్ట్ర సాధన కోసం, నీళ్లు, నిధులు, నియామకాల కోసం అలుపెరగని పోరాటం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గోవింద చారి, శ్రీనివాస్ చారి, వార్డు మెంబర్ ఫర్వీన్ బేగం, జి.రవి యాదవ్, బస్వరాజ్, గోపాల్ యాదవ్, పట్లోళ్ల నరసింహ, అలీమ్, సత్యనారాయణ, నహీమ్, మాణిక్యం చారి, యాదగిరి, రామచందర్, రజిని, దివ్య, నాగరావు, బాల్ రాజ్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రొఫెసర్ ‌జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here