జామియా మజీద్ అభివృద్ధికి‌ కృషి చేయండి – జడ్సీ ప్రియాంకకు స్థానికుల వినతి

నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్ పేట్ జామియా మజీద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసేలా చూడాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం జోనల్ కమిషనర్ ప్రియాంక అలను స్థానిక మైనార్టీ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఓల్డ్ హఫీజ్ పేట్ లోని జామియా మజీద్ అభివృద్ధికి నోచుకోక మజీద్ కు వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మజీద్ వద్ద సీసీ రోడ్డు, తదితర మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో సహకారంతో సయ్యద్ తాహెర్ హుస్సేన్, షేక్ సాబీర్, షేక్ జమీర్, సయ్యద్ ఇమ్రాన్ పాల్గొన్నారు.

జోనల్ కమిషనర్ కు వినతి పత్రం ఇస్తున్న‌ దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here