గచ్చిబౌలి గ్రామ స్మశాన వాటికను కబ్జా కాకుండా కాపాడుతాం – బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం‌ హయాంలో కబ్జాదారుల ఆగడాలకు‌‌ హద్దూ అదుపులేకుండా పోయాయని, స్మశాన వాటిల స్థలాలను సైతం వదలడం లేదని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ పేర్కొన్నారు. గచ్చిబౌలి గ్రామంలోని సర్వే నంబర్ 136 లో జరుగుతున్న భూ కబ్జాలపై గ్రామస్తులు తోట్ల భరత్ కుమార్, యాదయ్య, బాలరాజు, గడ్డ రాజు, లింగం, గడ్డ పరశురాం తదితరులు బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎనిమిది ఎకరాల స్థలాన్ని ఎప్పటి నుంచో ముస్లింలకు, ఎస్సీలకు స్మశాన వాటికల కోసం కేటాయించడం జరిగిందన్నారు. అందుకు సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయని, ఈ స్మశానవాటికలకు పూర్తిగా ఫెన్సింగ్ వేసి ఉన్నా ప్రైవేటు వ్యక్తులు కొంతమంది ఫెన్సింగ్ ను ను కూల్చేసి కబ్జా చేశారన్నారు. అలాగే అక్కడ ఉన్న కంకర గుంట అనే భావిని టీఆర్ఎస్ నాయకుల అండదండలతో పూర్తిగా మట్టితో పూడ్చేసి అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ అండదండలు చూసుకొని కబ్జాకోరులు ప్రభుత్వ స్థలాన్ని కాజేయాలని చూస్తున్నారని, దీని పక్కనే ఉన్న గచ్చిబౌలి గ్రామ స్థలాన్ని కబ్జా చేశారన్నారు. టీఆర్ఎస్ పాలనలో కబ్జాదారుల ఆగడాలు పెరుగుతున్నా టిఆర్ఎస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు, అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని రవికుమార్ యాదవ్ అన్నారు. స్మశాన వాటిక స్థలాన్ని కాపాడుతామని, మండల రెవెన్యూ అధికారులను కలవనున్నట్లు చెప్పారు. అధికారులతో మాట్లాడి తక్షణమే తగిన చర్యలు తీసుకునేలా చూసి స్మశాన వాటిక ను ఎస్సీలకు చెందేలా చూస్తామని గచ్చిబౌలి గ్రామ ప్రజలకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గచ్చిబౌలి‌ గ్రామ స్మశాన వాటిక స్థలాన్ని పరిశీలిస్తున్న బిజెపి నాయకులు రవికుమార్ 
కబ్జాదారుల నుంచి కాపాడాలని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ కు వినతిపత్రం ఇస్తున్న గచ్చిబౌలి గ్రామస్తులు

 

 

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here