నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రోత్సవాల పూజలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి కాలనీ అధ్యక్షుడు భేరీ రామచందర్ యాదవ్ పూజా కార్యక్రమంలో పాల్గొని నేతాజీ నగర్ కాలనీ ప్రజలు పట్టణ ప్రజలు దేశ ప్రజలందరూ కూడా గణనాధుని కరుణాకటాక్షాలు అందరికీ ఉండాలని, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అధ్యక్షుడు కె నరసింహ యాదవ్, చెల్లం శ్యామ్ బాబు, యువజన నాయకులు రాము యాదవ్, చెరుకుల శ్రీకాంత్, ఎం. వెంకట్, నాగరాజు, ఆర్ సాయి కుమార్, భరత్, లవణ చారి, డీజే భువన్, భేరీ చంద్ర శేఖర్ యాదవ్, కె అశోక్, అక్షయ్, లడ్డు పైల్వాన్, వినయ్, శ్రీను, గిరి, ఎం రాజు, అజయ్, తేజ తదితరులు ఉన్నారు.