ప‌ట్ట‌భ‌ద్రుల ఓట‌రు న‌మోదు పెద్ద ఎత్తున చేప‌ట్టాలి: కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

చందానగర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాల‌ని కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి డివిజ‌న్ తెరాస పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ బలబర్చిన అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ మేరకు
విద్యానగర్ డివిజన్ కార్యాలయంలో మహిళా సభ్యులతో ఆమె బుధ‌వారం సమావేశం నిర్వ‌హించారు.

స‌మావేశంలో మ‌హిళా స‌భ్యుల‌తో చ‌ర్చిస్తున్న కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

ఈ సంద‌ర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో అర్హులైన ప్రతీ గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో అధిష్టానం బలపర్చిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మహిళా సభ్యులు పని చేయాలని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆదేశాలు, సూచనల మేరకు చందానగర్ డివిజన్ పరిధిలో పట్టభద్రులను గుర్తించి భారీగా ఓటరు నమోదులో పాల్గొనేలా చురుకుగా పని చేయాలన్నారు. 2017 సంవత్సరం నాటికి డిగ్రీ (డిప్లమా) పూర్తి చేసిన వారిని గుర్తించి ఓటు నమోదు చేసుకునేందుకు దరఖాస్తు (ఫాం 18)తో పాటు ధ్రువీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచాలన్నారు.

ఓట‌రు న‌మోదుపై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here