నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మాదాపూర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ గంగల రాధకృష్ణ యాదవ్ ఆద్వర్యంలో ఖానమెట్ చౌరస్తాలో మైనంపల్లి హనుమంతరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ ప్రజలచే ఎన్నుకోబడిన మైనంపల్లికి అంత అధికారం మదం, అహంకారం ఉండకూడదని సూచించారు. పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు అయిన బండి సంజయ్పై వారు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని లేనియెడల నిరసనలు తీవ్రతరo చేస్తామని హెచ్చరించారు. బండి సంజయ్ అన్నకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్, అదేవిధంగా మన స్వతంత్ర సమరయోధులు అయిన గాంధీజీ ఫోటోలను కాళ్లతో తన్ని టీఆర్ఎస్ నాయకులకు తగిన గుణపాఠం తప్పదని, బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ పై బీరు బాటిల్స్ తో దాడి చేయడం చాలా సిగ్గుచేటు అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులను అరికట్టాలని ఇదంతా కేసీఆర్ డైరెక్షన్లోనే జరుగుతుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మైనంపల్లి చేసిన భూకబ్జాలు భూ దందాలు కప్పిపుచ్చుకోవడానికి ఇలా బండి సంజయ్ మీద ఎదురు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బిజెపి ఉపాధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, మధుయాదవ్, ప్రధాన కార్యదర్శులు T. V. మదనాచారి, శివ శ్రీనివాస్, కార్యదర్శులు గోవర్ధన్ రెడ్ది, కొండయ్య, ఓబీసీ ప్రెసిడెంట్ కృష్ణగౌడ్, ప్రధాన కార్యదర్శి సత్యం చారి, మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు చంద్రకళ, ప్రధాన కార్యదర్శి భారతి, బీజేవైఎం అధ్యక్షులు ఆనంద్, కార్యదర్శి నరేష్ రెడ్డి, నాయకులు శివాయాదవ్, గంగాధర్, కొండయ్య యాదవ్, దీపాల కొండయ్య, బాలు నాయక్, కృష్ణ నాయక్, నాగరాజు, బాలమ్మ తదితరులు పాల్గొన్నారు.