శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): భగత్ సింగ్ జయంతి సందర్భంగా శేరిలింగంపల్లి యూత్ ఆధ్వర్యంలో సోమవారం శేరిలింగంపల్లి మార్కెట్లో ఆయన చిత్రపటానికి హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి ప్రవీణ్ రెడ్డి, విజయ్, నాసర్, షర్ఫుద్దీన్, అహ్మద్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.