నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ దళిత మోర్చ ఐటీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా శేరిలింగంపల్లికి చెందిన పీఎస్ రాహుల్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా, రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షుడు సామ రంగారెడ్డిలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. శేరిలింగంపల్లి లోని బిజెపి నాయకులు కార్యకర్తల సహకారంతో దళిత మోర్చా అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. మోడీ సారథ్యంలో కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేస్తానని అన్నారు.






