గంగారం పెద్ద చెరువులో ఆక్రమణలను తొలగించండి: కసిరెడ్డి

జనంకోసం ఫిర్యాదు చేసిన గంగారం పెద్ద చెరువులోనే ఆక్రమణలు ఇవే

చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): గంగారం పెద్ద చెరువులో ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర రెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్, రాజేంద్రనగర్ ఆర్డివో లకు సోమవారం ఫిర్యాదు చేశారు. గంగారం చెరువు స్థలంలో ఓ మరుగుదొడ్డి, ఒక తాత్కాలిక గది, ఓ గుడిసె కనిపిస్తున్నదని అన్నారు. కబ్జాదారులు ఈ విధంగా ఆక్రమించడాన్ని వారం రోజుల క్రితం తహసీల్దార్ కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఐనా ఎలాంటి చర్యలు తీసుకోలేరని తెలిపారు. వెంటనే పై నిర్మాణాలను తొలగించి, చెరువును కాపడటంలో కఠినంగా వ్యవహరించాలని జనం కోసం కోరుతున్నది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here