శేరిలింగంప‌ల్లిలో ఘ‌నంగా భోగి వేడుక‌లు

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి‌): శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో బుధ‌వారం ప్ర‌జ‌లు భోగి పండుగ‌ను ఉత్సాహంగా జ‌రుపుకున్నారు. వేకువ జామునే లేచి భోగి మంట‌లు వేసి ఆనందించారు. ఆల‌యాల్లో భ‌క్తుల సంద‌డి నెల‌కొంది. త‌ల్లిదండ్రులు ఈ సంద‌ర్బంగా తమ చిన్నారుల‌పై భోగి పండ్ల‌ను వేసి ఉత్సాహంగా గ‌డిపారు.

భోగి పండుగ‌ను జ‌రుపుకున్న ఆరెక‌పూడి గాంధీ…
ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ త‌న నివాసంలో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి భోగి పండుగ‌ను జ‌రుపుకున్నారు. ఉద‌యం భోగి మంట‌ను వేశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ భోగి పండుగ ప్ర‌జ‌ల జీవితాల్లో సుఖ శాంతుల‌ను తీసుకురావాల‌ని ఆశిస్తున్న‌ట్లు తెలిపారు. అనంత‌రం ఆయ‌న శేరిలింగంప‌ల్లి ప్ర‌జ‌ల‌కు సంక్రాంతి పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు.

కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి భోగి వేడుక‌ల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
భోగి మంట‌లు వేసిన చందాన‌గ‌ర్ ఆర్‌వీస్ మాధ‌వ బృందావ‌న్ అపార్ట్‌మెంట్ వాసులు
చందాన‌గ‌ర్‌లోని శ్రీ సాయి మేఘ‌న రెసిడెన్సీలో భోగి మంట‌లు వేసిన స్థానికులు
పీజేఆర్ స్టేడియంలో భోగి మంటలు వేసి కాపుకుంటున్న మహిళా సిబ్బంది
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here