హఫీజ్ పేట్(నమస్తే శేరిలింగంపల్లి): మైనారిటీ వర్గాలను సైతం సంతృప్తి పరిచేలా బిజెపి ప్రభుత్వం దేశంలో పరిపాలన సాగిస్తోందని హఫీజ్ పేట్ డివిజన్ టిఆర్ఎస్ అభ్యర్థి అనూష మహేష్ యాదవ్ అన్నారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్ పరిధిలోని సాయి నగర్, యూత్ కాలనీలలో లో పర్యటించిన అనూష మహేష్ యాదవ్ స్థానిక ప్రజలను బిజెపికి ఓటు వేయాలని అభ్యర్థించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ట్రిపిల్ తలాక్ బిల్లు తీసుకు వచ్చి ముస్లిం మహిళల కష్టాలను దూరం చేసిందన్నారు. మైనారిటీ వర్గాలు సైతం బిజెపి పరిపాలన కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. బీజేపీ పార్టీ తోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు బీజేపీ కి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
