ద‌శ‌ల వారీగా మౌళిక వసతుల క‌ల్ప‌నకు కృషి: జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్‌

 

బ‌స్తీ వాసుల‌తో క‌లిసి రోడ్డు ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్‌

మాదాపూర్‌(న‌మ‌స్తే శేరిలింగంపల్లి):మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌ణాళికా బ‌ద్దంగా ముందుకు సాగుతోంద‌ని మాదాపూర్ కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్ అన్నారు. ఆదివారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ బస్తీలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు పనులను స్థానిక బస్తి వాసులతో కలిసి ఆయ‌న పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్‌ మాట్లాడుతూ పక్క ప్రణాళికతో ముందుగా ఇంటింటికి నీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులు చేపట్టి ప్రజలకు మౌళికవసతుల కల్పించేందుకు ముందుకు సాగుతున్నామ‌ని, మాదాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తున్నాన‌ని, ఇప్పటికే పూర్తయిన మంజీర పైప్ లైన్ మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులతో పాటు నూతన రోడ్ల నిర్మాణం కూడ పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామ‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా బ‌స్తీవాసులు కార్పొరేట‌ర్‌తో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మరియు ఆదిత్య నగర్ బస్తి అధ్యక్షులు మహమ్మద్ ఖాసీం,వార్డ్ సభ్యులు రహీం,మైనారిటీ నాయకులు లియకత్, బాబూమియా, షోయబ్, సలీం, మియన్ పటేల్, జాఫర్, మనికప్ప, యూత్ అధ్యక్షులు ఖాజా, బస్తి సభ్యులు రాయీస్, మహమ్మద్, మున్న, రషీద్, ఆర్షద్, ఇమ్రాన్, మహిళలు పర్వీన్ తదితరులు పాల్గొన్నారు.

ఆదిత్యనగర్ బస్తీవాసులతో సమావేశమైన కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

 

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here