శిల్పారామంలో నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌తో అల‌రించిన మ‌ధుసూద‌న్ నాట్య బృందం

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు ఆదివారం ఉత్సాహంగా జ‌రిగాయి. ఆంఫి థియేటర్ లో తాండవ ఆర్ట్స్ గురువు మధుసూదన్ ఆధ్వర్యంలో వారి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనతో ఎంతో ఆక‌ట్టున్నారు. నృత్య‌క‌ళాకారినీలు వైష్ణవి, మానస, రాగ, సాయి శృతి, భావన, పద్మావతి, మధుసుధన్‌లు పురందర దాసు కీర్తన, ఆధ్యాత్మ రామాయణ కీర్తన, పంచరత్న కృతి (త్యాగరాజ కీర్తన ), అన్నమాచార్య కీర్తన, రామాయణ శబ్దం, దశావతారం, మరకతామణిమయ, శివాష్టకం, అయిగిరి నందిని(మహిషాసుర మర్దిని) త‌దిత‌ర‌ అంశాలతో కూడిన నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌తో నృత్య‌ప్రియుల‌ను అల‌రించారు.

నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంటున్న మ‌ధుసూద‌న్ నాట్య బృందం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here