శిల్పపార్కులో ఘ‌నంగా శ్రీ రామ‌లింగేశ్వ‌ర ఆల‌య ప్ర‌తిష్టాప‌న‌ మ‌హోత్స‌వం

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మాదాపూర్ డివిజన్ ప‌రిధిలోని శిల్ప పార్క్ కాల‌నీలో శ్రీ రామలింగెశ్వర ఆలయ ప్రతిష్ట మహోత్సవం ఆదివారం ఘ‌నంగా జ‌రిగింది. వేద పండితులు మంత్రోచ్ఛార‌ణ‌ల న‌డుమ ఆల‌యంలోని విగ్ర‌హాల ప్ర‌తిష్టాప‌న ఉత్సాహంగా కొన‌సాగింది. ఈ కార్యక్రమంలొ ముఖ్య అతిథులుగా పాల్గొన్న‌ ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్‌, బిజెపి రాష్ట్ర నాయకులు యం.రవి కుమార్ యాద‌వ్‌, జ్ఞానేంద్ర ప్ర‌సాద్‌లు ప్ర‌త్యేక పూజ‌లు ఆచ‌రించారు. ఈ సంద‌ర్భంగా అతిథులు మాట్లాడుతూ కాల‌నీల‌లో ప్రార్ధ‌న మందిరాల ఏర్పాటు వ‌ల్ల ఎన్నో ఉపయోగాలుంటాని, ముఖ్యంగా మందిరానికి వెళ్లే వారికి మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంద‌ని అన్నారు. శిల్పా పార్కులోని ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో శ్రీ రామ‌లింగేశ్వ‌ర ఆల‌య ప్ర‌తిష్టాప‌న జ‌రుపుకోవ‌డం సంతోహష‌క‌ర‌మ‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజెపి కాంటెస్టెడ్ కార్పొరేటర్లు రాధాకృష్ణ యాదవ్, ఎల్లేష్‌, నాయ‌కుల‌ బాల కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ప్ర‌తిష్టాప‌న మహోత్స‌వంలో పాల్గొన్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ
స్వామి వారిని ద‌ర్శించుకుంటున్న బిజెపి రాష్ట్ర నాయ‌కులు ర‌వికుమార్ యాద‌వ్‌, రాధాకృష్ణ యాద‌వ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here