ఘ‌నంగా స‌ద్దుల బ‌తుక‌మ్మ వేడుక‌లు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని చందాన‌గ‌ర్ గౌత‌మిన‌గ‌ర్‌లో శ్రీశ్రీశ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయం వ‌ద్ద స‌ద్దుల బ‌తుక‌మ్మ వేడుకల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ స‌తీమ‌ని ఆరెక‌పూడి శ్యామ‌లా దేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

గౌత‌మిన‌గ‌ర్‌లో బ‌తుక‌మ్మ‌ల‌ను పేర్చిన మ‌హిళ‌లు

డివిజ‌న్ కార్పొరేట‌ర్ మంజుల ర‌ఘునాథ్ రెడ్డి గౌర‌వ అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా స్థానిక మ‌హిళ‌లు పెద్ద ఎత్తున బ‌తుక‌మ్మ ఉత్స‌వాల్లో పాల్గొన్నారు. ఆట‌లు ఆడుతూ పాట‌లు పాడుతూ సంద‌డి చేశారు. ఉత్సాహంగా వేడుక‌ల్లో పాల్గొన్నారు. అనంత‌రం సుమారుగా 200 మంది మ‌హిళ‌లు గంగారం చెరువు వ‌ద్ద‌కు వెళ్లి బ‌తుక‌మ్మ‌ల‌ను నిమ‌జ్జ‌నం చేశారు.

బ‌తుక‌మ్మ ఆడుతున్న మ‌హిళ‌లు

ఈ కార్యక్రమంలో గౌతమినగర్ కాలనీ అధ్యక్షుడు ప్రసాద్ రావు, గాంధీ చౌదరి, కట్ల శేఖ‌ర్ రెడ్డి, శ్రీకాంత్, రామాంజనేయులు, యాదయ్య, శ్రీను, రాజు పాల్గొన్నారు. అలాగే చందాన‌గ‌ర్‌లోని మాధ‌వ బృందావ‌న్‌లోనూ స‌ద్దుల బ‌తుక‌మ్మ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు.

మాధ‌వ బృందావ‌న్‌లో బ‌తుకమ్మ ఆడుతున్న మ‌హిళ‌లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here