శేరిలింగంపల్లి, అక్టోబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందానగర్ గౌతమినగర్లో శ్రీశ్రీశ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయం వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సతీమని ఆరెకపూడి శ్యామలా దేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ సందడి చేశారు. ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం సుమారుగా 200 మంది మహిళలు గంగారం చెరువు వద్దకు వెళ్లి బతుకమ్మలను నిమజ్జనం చేశారు.

ఈ కార్యక్రమంలో గౌతమినగర్ కాలనీ అధ్యక్షుడు ప్రసాద్ రావు, గాంధీ చౌదరి, కట్ల శేఖర్ రెడ్డి, శ్రీకాంత్, రామాంజనేయులు, యాదయ్య, శ్రీను, రాజు పాల్గొన్నారు. అలాగే చందానగర్లోని మాధవ బృందావన్లోనూ సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
