నేటి బాలలే రేపటి పౌరులు: శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం‌ నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి ‌డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప స్కూల్ లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నేటి బాలలే రేపటి పౌరులని, బంగారు భవిష్యత్తుకు పునాదులని పేర్కొన్నారు. పట్టుదలతో ఏదైనా సాధించగలరని, తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహంతో అద్భుతాలు సృష్టించగలరని ఉద్గాటించారు. ఈ సందర్భంగా చిత్రలేఖనం, హ్యాండ్‌ రైటింగ్‌, క్విజ్‌ కాంపిటీషన్‌ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ శ్రీకళ, పార్టీ నాయకులు ‌పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here