అక్టోబర్ 30 నుంచి నవంబర్ 12 వరకు శిల్పారామంలో నేషనల్ హ్యాండ్లూమ్ ఎక్స్ పో

నమస్తే శేరిలింగంపల్లి:మాదాపూర్ శిల్పారామంలో డెవలప్‌మెంట్ కమిషనర్ హ్యాండ్లూమ్స్, మినిస్ట్రీ అఫ్ టెక్స్ టైల్స్, గవర్నమెంట్ అఫ్ ఇండియా అండ్ శిల్పారామం హైదరాబాద్ సంయుక్తంగా ఈ నెల 30వ తేదీ నుంచి నేషనల్ హ్యాండ్లూమ్ ఎక్స్ పో (మై హ్యాండ్లూమ్-మై ప్రైడ్) ను నిర్వహించనున్నారు. అక్టోబర్ 30 న ప్రారంభమయ్యే హ్యాండ్లూమ్ ఎక్స్ పో నవంబర్ 12 వరకు జరగనుంది. చేనేత ఎక్స్ పో లో దాదాపుగా 70 చేనేత ఉత్పత్తుల కళాకారులు ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉండనున్నారు. పోచంపల్లి ఇకత్, నారాయణపేట, కాటన్ జ్యూట్, కలంకారీ బుర్రిస్, టై అండ్ డీఏ, బ్లాక్ ప్రింట్, చెందేరి కాటన్, మట్కా సిల్క్, వేంకటగిరి, మంగళ్ గిరి, జమ్మలమడుగు సిల్క్ సారీస్, బెంగాల్ కాటన్ తదితర చేనేత ఉత్పత్తులు సందర్శకుల కోసం అందుబాటులో ఉంటాయి. చేనేత కళాకారులను ప్రోత్సహించి ఆదరించాలని సంబంధిత అధికారులు కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here