![](https://namastheslp.com/wp-content/uploads/2020/10/IMG-20201031-WA0013-1024x576.jpg)
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): దీప్తిశ్రీ నగర్ శ్రీ ధర్మపురి క్షేత్రంలోని శ్రీ నాంపల్లి బాబా మందిరంలో శనివారం పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు దత్తహోమం, 9 గంటలకు సత్యనారాయణ స్వామి వ్రతం, 12 గంటలకు హారతి, అనంతరం బాబా వారి అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు జరిగాయి. పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నాంపల్లి బాబా దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా దత్త హోమం, సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2020/10/IMG-20201031-WA0012-1024x693.jpg)