మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను పరామర్శించిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాపర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ సోమవారం పరామర్శించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ మృతి పట్ల మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను, కుటుంబ సభ్యులను ప్రభుత్వ విప్ లు గొంగిడి సునీత, ఆరెకపూడి గాంధీ, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గువ్వల బాలరాజ్, కార్పొరేటర్లు నార్నె శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్ పరామర్శించారు. శాంతమ్మ మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను పరామర్శిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, ఎమ్మెల్యేలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here