మయూరీనగర్ పార్కును అహ్లాదకరంగా తీర్చిదిద్దుతాం: ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: అహ్లాదకరమైన వాతావరణంతో మయూరీనగర్ ఎంజెన్‌ పార్కును సుంధరీకరణ చేయడం జరుగుతుందని ప్రభుత్వ విప్, శాసన సభ్యులు‌ ఆరెకపూడి గాంధీ ‌అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో రూ. 2 కోట్ల నిధుల‌ అంచనా వ్యయంతో ఎంజెన్‌ పార్క్ లో చేపట్టిన సుందరికరణ, అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, డీసీ సుధాంష్‌తో కలిసి శనివారం గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ మయూరిన‌గ‌ర్‌తో పాటు చుట్టుపక్కల నివసించే ప్రజలకు ఈ థీమ్ పార్క్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. యువత కోసం జిమ్, పిల్లలకు ఆటస్థలం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పార్కు సుంధరీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీకాంతిని, డీఈ రూపదేవి, ఏఈ ధీరజ్ వర్క్ ఇన్ స్పెక్టర్లు విశ్వనాథ్, జగదీష్, శానిటేషన్ సూపర్ వైజర్ శ్రీనివాస్ మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు శ్రీనివాసరావు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఎంజెమ్ పార్కు అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here