గ‌ణ‌నాథుల‌కు కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్ పూజ‌లు

మియాపూర్‌, సెప్టెంబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని టీఎన్ నగర్, పీఏ నగర్ కాలనీలలో వినాయక చవితి ఉత్స‌వాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమలలో స్థానిక నాయకులు, కాలనీవాసులతో కలసి కార్పొరేటర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ ప్రజలకు వినాయకుడి ఆశీస్సులు ఉండాలని కోరుకున్న‌ట్లు తెలిపారు.

గ‌ణేషుడికి పూజ‌లు చేసిన కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్

డివిజన్ ప్రజల విఘ్నాలు తొలగి వారు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని ఆ గణపతిని కోరుకున్నట్లు చెప్పారు. మండపాల నిర్వాహకులు డివిజన్ పరిధిలోని గురునాథం చెరువు సమీపంలోని బేబీ పాండ్ లో నిమజ్జనానికి అన్ని రకాల మౌలిక వసతులను కల్పించడం జరిగిందని అందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోహన్ ముదిరాజ్, సుప్రజ, స్వామి, బాబూరావు, టీఎన్ నగర్ కాలనీవాసులు గంగాధర్, సంజు, చిన్న యాదవ్, పరమేశ్వర యాదవ్, మహేష్, రవితేజ, సోను శ్రీకాంత్, పీఏ నగర్ కాలనీ వాసులు, శ్రీనివాస్, శ్రీకాంత్, రాజు, సిద్దు, బబ్లూ, శివ, హేమంత్, శంకర్, హన్మంతు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here