మయూరి నగర్ కాలనీలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ప‌ర్య‌ట‌న

మియాపూర్‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ శ‌నివారం ప‌ర్య‌టించారు. కాల‌నీలో ఉన్న స‌మ‌స్య‌ల‌ను స్థానికులు ఆయ‌న‌కు విన్న‌వించ‌గా ఆయ‌న కాల‌నీలో ప‌ర్య‌టించి స‌మ‌స్య‌ల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ కాలనీలో ఉన్న ప్రతి ఒక్క సమస్యనూ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ దృష్టికి తీసుకువెళ్ళి త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస ప్రధాన కార్యదర్శి చంద్రిక ప్రసాద్ గౌడ్, మయూరి నగర్ కాలనీ అధ్యక్షుడు కిషోర్ కుమార్, అశోక్, విద్యాసాగర్ పాల్గొన్నారు.

మయూరి నగర్ కాలనీలో స‌మ‌స్య‌ల‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here