టీఆర్ఎస్ తోనే సమగ్ర అభివృద్ధి: జ‌గదీశ్వ‌ర్ గౌడ్

మాదాపూర్‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజన్ ప‌రిధిలోని సుభాష్ న‌గ‌ర్‌, రాజారాం కాల‌నీ, దోబీ ఘాట్‌ల‌లో డివిజ‌న్ తెరాస అభ్య‌ర్థి జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ మంగ‌ళ‌వారం ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీన ప్ర‌జ‌లు త‌మ‌ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేసి వారికి మ‌ళ్లీ సేవ చేసే అవకాశం కల్పించాల‌ని కోరారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల‌ గెలుపుకు ప్రతి ఒక్కరు సైనికుల‌లాగా పనిచేసి అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌న్నారు. ఈ సంద‌ర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దోబీ ఘాట్ల‌కు ఉచిత విద్యుత్ ను ఇస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంపై సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌గదీశ్వ‌ర్ గౌడ్‌ను గ‌జ‌మాల‌తో సత్క‌రిస్తున్న స్థానికులు
ఎన్నిక‌ల ప్ర‌చారంలో నినాదాలు చేస్తున్న జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌, నాయ‌కులు

న‌వ‌భార‌త్ న‌గ‌ర్‌లో…
మాదాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని న‌వ‌భార‌త్ న‌గ‌ర్‌లో మాజీ ఎమ్మెల్సీ పోల ర‌వీంద‌ర్‌తో క‌లిసి డివిజ‌న్ తెరాస అభ్య‌ర్థి వి.జగదీశ్వర్ గౌడ్ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా వారు మాట్లాడుతూ.. అభివృద్ధికి ప్ర‌జ‌లు ఓటు వేయాల‌ని, మాదాపూర్ డివిజ‌న్ లో గెలిచి సీటును సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల‌కు కానుక‌గా ఇవ్వాల‌న్నారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేసుకునే భాగ్యాన్ని మ‌రొక సారి క‌ల్పించాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో తెరాస నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

న‌వ‌భార‌త్ న‌గ‌ర్‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న మాజీ ఎమ్మెల్సీ పోల ర‌వీంద‌ర్, జగదీశ్వర్ గౌడ్
కారు గుర్తుకు ఓటు వేయాల‌ని కోరుతున్న జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here